పెనుగొండ వాసావాంబ
అనంతపురం జిల్లా లోని పెనుగొండ లో
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం
నిర్మించి వంద సంవత్సరాలు అయిన
సందర్భంగా (1916-2016) శతాబ్ది ఉత్సవాలు
16,17,18-05-2016 మూడు రోజులు నిర్వహించారు .
దానిలో భాగంగా అన్ని జిల్లాల లోని వైశ్య కవులు
కవయిత్రులను సన్మానించారు . నేను వెళ్లి
సన్మానం స్వీకరించి ఆ తల్లి ఆశీస్సులు అందుకొని
వచ్చాను . మూడో రోజు పూజలు ముగిసేసరికి
ఉరుములు మెరుపులతో వర్షం అదీ అనంతపురం లో
ఇంత కంటే ఆ తల్లి ఆశీస్సులకు నిదర్శనం ఇంకేమి కావాలి !
చూడండి మదుర మీనాక్షి అలంకరణ లో ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు
అనంతపురం జిల్లా లోని పెనుగొండ లో
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం
నిర్మించి వంద సంవత్సరాలు అయిన
సందర్భంగా (1916-2016) శతాబ్ది ఉత్సవాలు
16,17,18-05-2016 మూడు రోజులు నిర్వహించారు .
దానిలో భాగంగా అన్ని జిల్లాల లోని వైశ్య కవులు
కవయిత్రులను సన్మానించారు . నేను వెళ్లి
సన్మానం స్వీకరించి ఆ తల్లి ఆశీస్సులు అందుకొని
వచ్చాను . మూడో రోజు పూజలు ముగిసేసరికి
ఉరుములు మెరుపులతో వర్షం అదీ అనంతపురం లో
ఇంత కంటే ఆ తల్లి ఆశీస్సులకు నిదర్శనం ఇంకేమి కావాలి !
చూడండి మదుర మీనాక్షి అలంకరణ లో ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు
ఇంకా హోమాలు , గజ గౌరీ వ్రతాలు , పెనుగొండ ఆడపడుచులకు
వడిబాలు కట్టుట , అమ్మవారిని ఏనుగు పై గ్రామోత్సవము చాలా
బాగా జరిగాయి .
గజ గౌరీ వ్రతం లో అమ్మవారు చూడండి
చక్కగా ఫ్లెక్సీ లు , పందిళ్ళు వేసి అతిధులకు మంచి భోజనం
మూడు రోజులు ఏర్పాటు చేసి అందరు ఒక్కటిగా పని చేసి
అమ్మవారి కృపకు ఆర్య వైశ్యులు అందరు పాత్రులు అయ్యారు
అధ్యక్షులు నాగరాజు గారు ఇంకా ఇతర సభ్యులు ఎంత చక్కగా
అమ్మవారి శాలువాతో ,1116/- ఇచ్చి యెంత చక్కగా మమ్మల్ని
సత్కరించారో చూడండి . ఆశావాది ప్రకాశరావు గారి ఆధ్వర్యం
లో సభ చక్కగా జరిగింది .